చతుర్ధప్రకరణము
205
వీతరాగుఁడు, కాల-వేది, శ్రీమంతుఁ,
డాతత విశ్రాంతుఁ, - డధిక శాంతుండు,
ఆయువుగల పుణ్యు.. - డనఘవర్తనుఁడు
వాయస శ్రేష్ఠుండు - వసియించి యుండు.
అతనిఁ జూచుటకు నే - నరుగఁగా, నెదుట
నతిశయ్య వృక్షమం - దల్లి దట్టముగఁ
దెఱఁగొప్ప బంగారు - తీఁగెల కొనల
సరసంబులైన పు-ష్ప ఫలంబులందుఁ
గలకల ధ్వనులతోఁ - గలసి క్రీడించు
లలిత విహంగ జా-లములఁ జూచుచును, 80
అలఘు సహస్ర ద-శాబ్దనాళములఁ
జెలరేఁగి మెక్కుచుఁ - జిందు ద్రొక్కుచును,
వనజాతభవునకు - వాహనం బగుచుఁ
దనరారుహంస సం-తతులఁ జూచుచును,
నటుచనఁ జన నంజ-నాద్రి సమాన
వటుతర దేహంబు, - పక్షయుగంబు,
ఘనతీవ్రతుండంబు - గలి, గిరువంక
లను వృద్ధకాక జా-లంబులు గొలువ,
నచట సుఖాసీనుఁ-డైన భుశుండు
నచలాత్ము నీక్షించి - యంచుకుఁ బోయి 90
నిలిచిన, ననుఁజూచి - నెనరుతో లేచి,
నలువొప్ప విహితాస-నమున న న్నుంచి,
యుచితవృత్తిని నిల్చి-యుండగా, నట్టి
యచలితాత్మునిఁ గాంచి - యచటఁ గూర్చుండ