162
వాసిష్ఠరామాయణము
నట శుచి స్థలినిఁ బ-ద్మాసనమందు
ఘటికుఁడై కూర్చుండి - కనుఁగవ మోడ్చి, 830
ధారాళముగ మారు-తమును రేచించి,
పూరించి కుంభకం-బున నిల్పి, మదిని
నెఱిఁగి ప్రాణములతో - నింపొందఁ గూర్చి,
పరఁగ హృదగ్నినిఁ - బ్రబలింపఁ జేసి,
కాయ మా యగ్ని క-క్కడ సమర్పించి,
మాయ నడంచి ని-ర్మల భావుఁ డగుచు,
సరవి నాధారాది - చక్రషట్కంబుఁ
గర మొప్ప దాఁటి, శృం-గాటకమందుఁ
గదలక నాసికా - గ్రంబు పై దృష్టిఁ
గదియించి నడిమి మా-ర్గంబునఁ బోయి, 840
కర మర్థితో దీర్ఘ - ఘంటారవంబు
మొఱయు సహస్రార - మునఁ జేరి, యవల
చలమున నూరక - శ్రమ నొందు ప్రాణ
ములు చేతనామృత-మున శాంతికొఱకుఁ
బొంది, తదాకాశ-మున దోఁగి చాల
నందు సంపన్నంబు - లయ్యె నయ్యెడను;
మనము నంతర్బాహ్య - మధ్యంబులందు
ననఘమై, పరిపూర్ణ-మై నిండియున్నఁ
బరతత్త్వమునఁ బొంది - పరమసంతోష
భరితమై వెలి చలిం-పక నిల్చియుండె. 850
తపసియు హృదయాగ్ని - దగ్ధ దేహంబు
నపుడు బోధామృత - మం దుంచి, శాంతిఁ