పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

వాసిష్ఠరామాయణము

నట శుచి స్థలినిఁ బ-ద్మాసనమందు
ఘటికుఁడై కూర్చుండి - కనుఁగవ మోడ్చి, 830

ధారాళముగ మారు-తమును రేచించి,
పూరించి కుంభకం-బున నిల్పి, మదిని

నెఱిఁగి ప్రాణములతో - నింపొందఁ గూర్చి,
పరఁగ హృదగ్నినిఁ - బ్రబలింపఁ జేసి,

కాయ మా యగ్ని క-క్కడ సమర్పించి,
మాయ నడంచి ని-ర్మల భావుఁ డగుచు,

సరవి నాధారాది - చక్రషట్కంబుఁ
గర మొప్ప దాఁటి, శృం-గాటకమందుఁ

గదలక నాసికా - గ్రంబు పై దృష్టిఁ
గదియించి నడిమి మా-ర్గంబునఁ బోయి, 840

కర మర్థితో దీర్ఘ - ఘంటారవంబు
మొఱయు సహస్రార - మునఁ జేరి, యవల

చలమున నూరక - శ్రమ నొందు ప్రాణ
ములు చేతనామృత-మున శాంతికొఱకుఁ

బొంది, తదాకాశ-మున దోఁగి చాల
నందు సంపన్నంబు - లయ్యె నయ్యెడను;

మనము నంతర్బాహ్య - మధ్యంబులందు
ననఘమై, పరిపూర్ణ-మై నిండియున్నఁ

బరతత్త్వమునఁ బొంది - పరమసంతోష
భరితమై వెలి చలిం-పక నిల్చియుండె. 850

తపసియు హృదయాగ్ని - దగ్ధ దేహంబు
నపుడు బోధామృత - మం దుంచి, శాంతిఁ