పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

శ్రీ మ దు త్త ర రా మా య ణ ము

సీ. ఉపవనీరమ మారుతోత్పతత్కుసుమరాజీకైతవంబున సేస లిడఁగఁ
    బ్రాకార లక్ష్మివజ్రపు రాలతళుకుచేఁ దనమేన మంచిగందంబుఁ బూయ
    భర్మగోపురచరత్పారావతద్విజశ్రేణి పల్కులనె యాశీర్వదింప
    జరామార్గచిరత్నరత్నసౌధశ్రీలు గడురక్తి కుంకుమ గాన్క సేయఁ

తే, గేళిభూభృత్పరంపరల్ కేతనాంశు, కాప్తిఁ బావడ లూన ముక్తాశ్మధామ
    లలితరుచిధూతచంద్రకలంకఁ లంక, రాజసమునఁ బ్రవేశించె రాజ రాజు. 184

మ. ధనదుం డీగతి లంకఁ జేరి సురగంధర్వాప్సర స్సేవ్యుఁ డై
     తనయాజ్ఞోన్నతి నైరృతుల్ భయము జెందన్ దత్పురం బేలుచున్
     జనయిత్రిన్ జనకున్ గనుంగొనఁగ నిచ్చల్ పుష్పకారూడుఁ డై
     చనుచున్ గ్రమ్మఱుచున్ సుఖించె నతు లైశ్వర్యం బవార్యంబుగన్. 185,

తే. అని యదంభవచోనిగుంభనలఁ గుంభ, సంభవుండు పులస్త్యవంశక్రమంబు
    గొంత గెలిపిన విని శ్రీ రఘుప్రవీర,వర్యఁ డిట్లను నాశ్చర్యధుర్యు డగుచు.186

శా. ఓవింధ్యాచలగర్వనిర్హరణయాతోద్యోగ పూర్వంబు లం
    కావాసంబు సురారినాథులనికాయ్యం బంచు మీ రానతీఁ
    గా విన్నప్పటినుండి చిత్ర రసశంకాసంకులం బయ్యె మ
    ద్భావం బంతకు మున్న తాదృశబలుల్ దైతేయు లెవ్వారోకో. 187

ఉ. ఆదిఁ బులస్త్యవంశభవు లాసురముఖ్యు లనంగ వింటినే
    తాదృశరాక్షసాధికులు దానవు లంతకు మున్నె లంకలోఁ
    బాదుక యుందు రం చిపుడు వల్కితి రీదశకంధరప్రహ
    స్తాదులకంటె వీరవరు లైనసురారులు వార లెవ్వరో. 188

ఉ. వారికి వంశకర్త యగువారి తెఱంగులు వారి పేరులున్
    వారిబలోన్నతుల్ పిదప వారు ముకుందున కోడి లంకకున్
    జేరక పోవుటల్ జటిల శేఖర తెల్పుము విస్తరించి నీ
    చారుసుధారసోపమవచఃకలనన్ జెవు లింపు సెందెడిన్ . 189

ఉ. భానునిచే మహాతమముఁ బాయుతెఱంగున మాను మాదృశా
    జ్ఞానము మిమ్ముబోఁటిబుధచంద్రులచే నని జానకీబహిః
    ప్రాణము రామభూవిభుఁడు ప్రశ్న మొనర్ప దరస్మితంబుతోఁ
    దా ననియెన్ దథావిధకథావిదుఁ డమ్ముని సమ్మదంబునన్ 190

మ. రవివంశోత్తమ సంశయం బయినచోఁ బ్రశ్నంబు గావింప నే
     ర్తు వినన్ నేర్తువు సావధానముగ నిన్ స్తోత్రంబు సేయంగ మా
     కు వశంబే పరమేష్ఠినుండియును రక్షోవంశ మాద్యంతమున్
     వివరింతున్ వినుమం చగస్త్యుఁ డను బ్రావృట్కాలమేఘార్భటిన్. 191
.