పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(2) 1480 నుండి 1550 వరకూ ద్వితీయ దశ. ఈ దశలో తెలంగాణ మినహా ఆంధ్రదేశమంతా కృష్ణదేవరాయల పరిపాలన క్రింద వుంది.

(3) 1550 నుండి 1650 వరకూ మూడవదశ. ఇది పతనావస్థకు సంబంధించన కాలం.

తలవంచని వీరులు:

కృష్ణదేవరాయల మరణానంతరం 1565 వరకూ విజయనగర సామ్రాజ్యం మహోజ్వలంగా సాగి చివరకు తళ్ళికోట యుద్ధంలో దెబ్బతింది. దక్కను సుల్తానులందరూ ఏకమయ్యారు. రామరాజును చంపి అతని సైన్యాన్నంతా చెల్లాచెదరు చేసివేశారు. అయినా విజయనగర సేనల బలాధిక్యత ఏమాత్రం క్షీణించక తిరుమల దేవరాయల నాయకత్వాన పెనుగొండను రాజధానిగా జేసుకొని రాజ్య పరిపాలన సాగించారు. అతని అనంతరం శ్రీ రంగరాయలు దుర్బలుడవడం వల్ల రాజధానిని తిరుపతి దగ్గర వున్న చంద్రగిరికి మార్చుకున్నాడు. ఈ విధంగా క్రీ.శ. 1630 తరువాత విజయనగర సామ్రాజ్యం అంతరించింది. విజయనర సామ్రాజ్యాన్ని పరిపాలించిన అనేక మంది లలితకళలను ఎంతగానో పోషించారు.

విదేశీయులు మెచ్చిన విజయనగరం:

హంపి విజయనగరం ఒక కళాకేంద్రంగా వికసించింది. 15, 16 వ శతాబ్దాలలో, విజయనగర సామ్రాజ్య పరిపాలనాకాలంలో ఇతర దేశాలనుంచి వచ్చిన అనేక మంది రాయబారులూ, వ్వాపారులూ, యాత్రికులూ ఈ విజయనగరాన్ని దర్శించారు. విజయనగరం కళా వైభవాలను గూర్చీ, శిల్పకళా వైదగ్ధ్యాన్ని గూర్చీ వారి వారి దినచర్య పుస్తకాలలో ఉదాహరించుకున్నారు. పీట్రోడెల్టా అనే పోర్చుగీసు దేశస్థుడు విజయనగరాన్ని దర్శించాడు. ఈ వివరాలను కలకాత్తా వాస్తవ్యుడు బి.జి.పాల్ .195(?)4లో 'సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ ఇన్ విజయనగర' అనే గ్రంథంలో ఈ క్రింది విధంగా వివరించాడు.

కోలాహలంగా కోలాటాలు

పీట్రోడెల్టా వసంతోత్సవాలను సందంర్శించాడు. వసంతోత్సవాలు మహా