పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకతీయ యుగంలో నాట్య బహుళ ప్రచారంలో వున్నట్లు ఆ నాటి సంస్కృత గ్రంథాలలో ఉదహరింపబడి వుంది. జాయపసేనాని రచించిన అపూర్వ నృత్యశాస్త్ర గ్రంథం ('నృత్తరత్నావళి'- సంస్కృత గ్రంథం) ఆనాటిదే.

జాయపసేనాని కత్తి వీరుడే కాక కళాప్రియుడైన సేనాని:

కాకతి గణపతి దేవ చక్రవర్తి కటాక్షానికి పాత్రుడైన జాయప తన స్వయంశక్తి వల్ల సేనాని కాగలిగాడు. ఈయన వీరుడే గాక, కళాకారుడు కూడాను.

నృత్యాలంటే జాయపకు అత్యంత అభిమానం. స్వయంగా నృత్తరత్నావళిని రచించాడు. ఈ నృత్తరత్నావళి భారతీయ నృత్య సంపదకు ఆభరణమని నృత్య విద్యావేత్తల అభిప్రాయం. సంస్కృత భాషలో ఆంధ్రుల రచించిన మొట్టమొదటి నృత్యశాస్త్ర గ్రంథం ఇదేనని మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు తెలియజేశారు. ఒక వ్యాసంలో.

దీనిని రచించిన జాయప సేనాని అసలు పేరు జాయన. ఈయన అయ్యకుల సంజాతుడు. పిల్ల చోడన పుత్రుడు. తాత-ముత్తాతలది వెలనాడులోని క్రొయ్యూరు. చందవోలు రాజధానిగా ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన వెలనాటి మహీపతుల వద్ద ఈతని తండ్రీ, తాతా సేవలు చేశారు.

జాయన ఆయచమూపతి, జాయనేనాధినాథుడు, గజసాహిణి జాయన, గజ సైన్యాధినాథుడు అనే పేర్లతో పిలువబడుతూ వుండేవాడు. గణపతిదేవ చక్రవర్తి జాయపయందు అత్యంత అభినామంతో అతనికి సకల విద్యలనూ, కళలను నేర్పించాడు. ఆ తరువాతనే జాయప అత్యుత్తమమైన నృత్తరత్నావళి రచనను పూనుకుని క్రీ॥శ॥ 1253 -54 ప్రాంతంలో పూర్తి చేశాడు.

నృత్తరత్నావళి జానపదకళారూపాల వర్ణన:

నృత్తరత్నావళిలో మార్గ, దేశి నృత్యాలు రెండూ కలిపి కట్టుగా నడిచాయి. ఇందులో ఎనిమిది ఆద్యాయాలున్నాయి. మొదటి ఆధ్యాయం నర్తన వివేకం,