పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
అలాంటి పేరిణి నృత్యం:

పేరిణి నృత్యమంటే, అలాంటిది. పేరిణి నృత్యం చేసే ప్రతి వ్వక్తీ శివుణ్ణి తనలో ఆవహించుకుని ఆవేశంతో నృత్యం చేస్తాడు. మేళవింపు విధానం పేరణికి అతి ముఖ్యమైనది.

ఓ పరమశివా? నాలో శివశక్తిని ప్రవేశింపచేసి, నా శరీరాన్ని పవిత్ర మొనరించి, నా శరీరం ద్వారా నీ పవిత్ర నృత్యాన్ని లోకానికి ప్రసాదించు అని ప్రార్థిస్తూ, ఈ నర్తనాన్ని ప్రారంభించాలి. ఈ ప్రారంభమే నృత్యకారుల్లో ఆవేశ పరుస్తుంది. ఆ ఆవేశంతోనే నృత్యకారుడు పేరిణి నృత్యాన్ని శివ తాండన నృత్యంగా మలుచుకుంటాడు. నిజానికి ఇది ఎంతటి ఔన్నత్యంతో కూడుకున్న నృత్యమో మనం అర్థం చేసుకోవచ్చు.

చరిత్ర గతిలో బతికి జీర్ణమై పోయి పేరిణి అని పేరు మాత్రమే మిగిలి పోయిన ఈ విశిష్ట నృత్యాన్ని, నటరాజ రామకృష్ణగారు పరిశోధించి, పరిష్కరించి, దానికొక సజీవ రూప కల్పన చేసి, పూర్వ వైభవాన్ని మన కళ్ళముందుంచారు. పేరిణి చరితార్థమైనట్లే, నటరాజ రామకృష్ణగారు కూడ చరితార్థులు.