పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
అందరకీ మక్కువైన పెక్కు నాటకాలు:

కూచిపూడి భాగవతులు నాటకాల్లో రామాయణ, భారత, భాగవతి గాథలకు సంబంధించిన గాథలను యక్షగాన వీథినాటకాల రూపంలో సాంప్రదాయ సిద్ధంగా ఈ క్రింద వుదాహరించిన వాటి నన్నిటిని ప్రదర్శించేవారు.

త్యాగరాయ కృతులు__జయదేవుని అష్టపదులు__మువ్వ గోపాల పదాలు, __ భద్రాచల రామదాసు కీర్తనలు__ నారాయణ తీర్థుల తరంగాలు__సారంగపాణీ కీర్తనలు__ తుంగతుర్తి కృష్ణదాసు కృష్ణలీలలు__ తాళ్ళపాక అన్నమాచార్యులు గారి ప్రహ్లద__హరిశ్చంద్ర.__ రామనాటకం __ఉషాపరిణయం గొల్లకలాపం__భామాకలాపం__ దాదినమ్మ వేషం__ దశావతారాలు__మండూకశబ్దం ప్రహ్లద పట్టాభిషేకం__బాలగోపాల తరంగం మొదలైన వెన్నో ప్రదర్శించేవారు.

ప్రతిభావంతులైన కళాకారులు:

కూచిపూడి కళాకారులు ఒక్క నాట్య సంగీతాల్లోనే గాక అలంకార శాస్త్రంలోనూ, మంత్ర శాస్త్రంలోనూ, భాషా శాస్త్రంలోనూ, వాద్య శాస్త్రంలోనూ కూడ నిరుపమానమైన ప్రజ్ఞానైపుణ్యం గలవారు. కూచిపూడి వారిలో వేదాంతం వారనీ, చింతావారనీ, పసుమర్తి వారనీ, భాగవతుల వారనీ, వెంపటి వారనీ, ఇంగువ వారనీ, బుక్కా వారనీ ప్రసిద్ధ కుంటుంబాల వారున్నారు. కొన్ని శతాబ్దాల పాటు దీర్ఘప్రశస్తిని పొందారు. 19 వ శతాబ్దం ప్రారంభం నుండి నేటివరకు అఖండమైన కీర్తి నార్జించుకుని కూచిపూడి సాంప్రదాయాన్ని వుద్ధరించిన ఈ క్రింది కళాకారులు కీర్తి శేషులైనారు.

ఎందరో మహానుభావులు:

1.చింతా వెంకటరామయ్య
2.చింతా రత్తయ్య
3.చింగా నారయణమూర్తి
4.చింతా ఆదినారయణ
5.చింతా రామమూర్తి
6.వెంపటి వెంకట్ఘనారాయణ
7.పెంపటి పరదేశి