పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిఠారి తొక్కిన జిక్కిణీ కోపు


ఝుక్కిణీ లాస్యం మతంగ మహముని వల్ల అవిర్భవించిందని, ఆయన రచన బృహద్దేశి వలన తెలుస్తూ ఉంది.

ఒక నాడు ఆంధ్ర దేశంలో జిక్కిణి నృత్యం బహుళ ప్రచారంలో వున్నట్లు 17 వ శతాబ్ధంలో వెలువడిన అనేక ప్రబంధాలలో జిక్కి ణి ఒక ప్రముఖమైన నాట్య విన్యాసమని తెలుస్తూంది.

రామాభ్యుదయంలోనూ, చంద్రభాను చరిత్రలోనూ, ఉత్తర రామాయణం లోను, పాంచాలీ పరిణయం మొదలైన ప్రబంధాలలో జిక్కిణి ప్రశంస వుంది.

ఇంక తంజావూరు ఆంధ్ర నాయక రాజుల ఆస్థానంలో "జిక్కిణి" నాట్య ప్రదర్శనలు విరివిగా జరిగినట్లు (క్రీ॥శ॥ 1631 - 73 ) ప్రాంతాలలో వెలువడిన రఘునాథ నాయకుని ప్రహ్లద యక్షగానాల వల్లనూ అదే ఆస్థానంలో వెలుగొందిన చెంగల్వ కాళ కవి, రాజగోపాల విలాస ప్రబంధాల వల్లా.

అలాగే తంజావూరు రాజాస్థానానికి చెందిన "అన్నదాన నాటకంలో" కూడ జక్కుల రంగసాని పదకేళిక ప్రసక్తి వుంది.