పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

297


సీ. ఒడలెఱుంగనిభీతి నొండొరు ల్దాకుచో
        నడియాసమును గ్రుద్దులాడువారు
మెసలనీక భుజంగవిసరము ల్గవయుచో
        పందిటికంబముల్ బ్రాకువారు
తొడిబడి క్రూరజంతువు లడ్డుపడినచో
        ఎదలు మోదుకొని బిట్టేడ్చువారు
నెట్టిహీనుఁడు తమ కెదురేఁగుచున్నచో
        రక్షించుమనుచు బోరగిలువారు


తే.

మఱదు లత్తలు మామలు మగలు జూడ
వెలఁదు లార్తిని గంతులువేయువారు
క్రూరదానవమాయాప్రచారములకు
బీరముల బొరియల దూఱువారు.

171


ఉ.

కౌరవయాదవావళి చికాకున మేనులు ద్రిమ్మరింప వి
స్తారభయాకులత్వమున దల్లడ మందుచు గుంపుగుంపులై
బాఱిరి యందులో నొకఁడు పాండవపక్షముగాన మాధవుం
డూరక జూచుచుండె దనుజోజ్జ్వలమాయ లడంపజాలియున్.

172


క.

దనుజుం డీగతి జననీ
మణి నెవ్వగ మదిఁ దలంచి మాయోపాయం
బున చిందఱవందఱలై
జన నందర గర్వభంగసరణి నడంచెన్.

173


చ.

అపుడు కురుక్షితీశుఁ డరుణాత్మజసైంధవశల్యముఖ్యధీ
నిపుణుల గాంచి యిట్లనియె నెమ్మిని మీర లఖండధైర్యని
శ్చపలత గల్గి భీరువులచాడ్పున నిట్ల చికాకు జెందుటల్
నృపతికి లౌకికంబున కనీతియు లాఘవముం ఘటింపదే.

174


మ.

ఎవఁడో పాండవపక్షపాతమతి నేఁ డీలాగు దుర్వత్తికిం
దవులంబోలు నటంచుఁ దోఁచె మన మీధైర్యంబు బోకార్చుటే