పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

295


ఱెసఁగ బెనంగుచున్ మరుఁగుటిండ్లను దూఱుచు వెల్కిబాఱుచుం
బుసబుస రోజుచుం ధరణిఁ బొర్లుచు లేచుచుఁ బాఱుచు న్నెడన్.

161


గీ.

ఆయసురమౌళి తనమహామాయవలన.
విషభుజంగమతతుల వేవే లొనర్ప
నవి భయంకరఫూత్కార మడర వెడలి
విప్రతతివెంటఁ బడ వారు వెఱచి పఱచి.

162


చ.

పరువడి వార లొండొరులపైఁబయి వ్రాలుచు లేచి పౌరులం
దరుగని దల్లడిల్లఁగ బదంబులు దొట్రిల గంతులేయుచున్
నెఱి సిగముళ్ళు వీడగను నెవ్వగ మేనులుఁ జెమ్మరింప దు
ర్భరత మొరో మొరో యనుచు బాఱిరి క్రూరభుజంగభీతులై.

163


క.

అంతట మాయాదనుజుం
డంతంతకు చిత్రగతుల నాశీవిషముల్
వింతలగు వృశ్చికాదిమ
జంతువుల సృజించె సకలజనభయదముగన్.

164


క.

కాకోదరవృశ్చికతతు
లీకరణం బొడమి బ్రజల నిట్టట్టుగ చీ
కాకుపడ వెండనంటె మ
హాకులమతి కామపాలుఁ డచ్చెరువందన్.

165


తే.

శకునిబాహ్లికకర్ణదుశ్శాసనాది
యోధు లాసర్పవృశ్చికబాధలకును
దిగులుమదిజాలి వెడలగా తెఱువుమాలి
నిలిచి నిశ్చేష్టితాకృతుల్ బొలచి రపుడు.

166


క.

ఆయెడ దానవమాయో
పాయమునన్ వృకతరక్షుభల్లంబులనే