పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

291


గదియుట వింతలై వికవిక న్నగఁగా మది సిగ్గుజెంది న
ట్లు దలను వంచె నక్కపటలోలవిలోచనమోహనాకృతిన్.

136


తే.

లక్ష్మణునకునుమాత్ర మీలాగు దోఁచి
నితరజనులకు భువనమోహినితెఱఁగున
గానఁగానయ్యె నింతటిలోన నతఁడు
తెలివినొందిన మతితోడ దేరిఁజూడ.

137


చ.

మునుపటిరూపులంద నను మోసముపుచ్చినభీతిచే గనుం
గొన నొకబెబ్బులింబలెనె కోఱలు గీటుచు భీమహుంకృత
ధ్వను లెసఁగం గరాళతరవక్త్రము జాపి చివాలునం బయిం
బెనుగొని దూకినట్లయిన భీతిలి పెద్దయెలుంగుతో ననెన్.

138


ఉ.

పాపఁపు గబ్బిబెబ్బులిని బత్ని యటంచని బెండ్లి జేసి నా
రూ పణఁగించ నేటికి మొరోమొరొ పెండిలికూఁతు గా దయో
యీపగిది న్యదువ్రజము లిండ్ల మెలింగెడి పెద్దదేవరం
జూపి వివాహమంచు పెనుసోకుడుపాల్ నను జేతు రయ్యయో.

139


క.

కలమేన బ్రాణముండిన
బలుసాకుఁ న్మెసఁగియైన బ్రతికెద నిక న
న్నిలుజేర్చుము తండ్రీ నా
తలపై పడివేలయేండ్లు ధరణిన్ మనవే.

140


ఉ.

ఎక్కడి పెండ్లికూఁతు రిక యెక్కడ సుద్వహ మింతలోన నం
ద్రొక్కి వధింపదే యడుగు దొల్లగనిచ్చునె మేనబ్రాణముల్
దక్కినజాలు రాజ్యసుఖదంబులు కామినులేల మీకు నే
మ్రొక్కెద నన్నలార పులిముందఱ ద్రోయక పోవనీయరే.

141


గీ.

తొలుతఁ గన్నులబండుపై దోఁచి తుదకు
కోఁతికొండెంగ కుందేలు గుడ్డివెలుగు