పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

225


నడయాడుకొండపై యడరు శృంగము లట్లు
        నెగుభుజంబులు చెవుల్ దగుల నుబుక


గీ.

ధనువు నెక్కించి కనులరౌద్రంబు బెంచి
సాహసం బెంచి చివ్వున చౌకళించి
శూరతను బెంచి చన నెంచు సుతుని గాంచి
దిగ్గన సుభద్ర చింతించి దగ్గఱించి.

139


క.

అన్నా తామసి తామసి
యన్న వినీతిని దలంప వత్యుగ్రుఁడవై
యున్నన్ మాన్పగ వశమే
సన్నుతరణశూర! సవ్యసాచికుమారా!

140


ఉ.

కౌరవులుం దురాత్మకులు గాపున వారికి వశ్యుఁడైన యీ
సీరీకుమారినే సతిగ జేకొనకున్న గౌఱంతయౌనె శృం
గారగుణాభిరామలగు కన్నియ లెందఱు లేరు తండ్రి ని
ష్కారణవైర మేల నుడుగందగు నింతటనై న బుత్రకా!

141


శా.

ఏలోకంబులయందునైన గలదే యీలాఁటి దుష్కృత్య ము
త్తాలోగ్రాకృతి మేనమామలపయిం దండెత్తి భంజింప నీ
లీలం గూడచు తండ్రి కన్నియను చెల్మి న్నీకు నీకుండినన్
మేలాయెం జనదూష్యమైన పని సుమ్మీ కోపమే పాపమౌ.

142


చ.

అనుచు సుభద్ర కూర్మి తనయాగ్రణిచేతులు బట్టి భీతిమై
తనువు వడంక గద్గదికత న్వచియించు వినీతిబోధనో
క్తిని నిశితాంకుశంబులగతిం దగి మత్తగజంబురీతిగా
వెనుకకు ద్రొక్కి తామసము వీడక నిట్లనె తల్లితోడుతన్.

143


మ.

ధరణీభోగములెల్లఁ బోవిడిచి మాతండ్రు ల్మహారణ్యసం
చరులై పోవ పిఱుంద నీవు జననిచ్చన్ లేక మీయన్న లా