పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

37


మ.

కరుణాసింధువు భక్తవత్సలసమగ్రప్రీతి జన్మించి యి
వ్వరుసం బూతన, బండిరక్కసుఁ, దృణావర్తుం, బకున్, మద్దులన్
ఖరునిం, బౌండ్రకు, జైద్యునిన్, నరకునిం, గంసున్, మురుం ద్రుంచి భూ
భరముం బాపి నిరంకుశప్రతిభచేఁ బాలించుచుండెన్ భువిన్.

138


క.

ఈరీతి నష్టమహిషీ
నారీతిలకములచే ననారతము నిజే
చ్ఛారీతి మెలఁగుచును చన
వారీతులనుడిపె నతఁ డవారితకరుణన్.

139


క.

ఆలమ్మున మురనరకుల
గూలంగ నడంచి తెచ్చుకొనినట్టి పదా
ర్వేలాంగన లాలింగన
లోలింగన దా ననంగయుక్తి నెసంగెన్.

140


క.

గారామున గోరిన వని
తారాజిని గలసి మెలసి తా రాజీలె ని
త్యారామసీమలందు వి
హారామలచిత్తవృత్తి సత్యుత్సుకుఁడై.

141


క.

క్షుద్రారిమరవిదారుం
డద్రీంద్రసమానధీరుఁ డఖిలసుగుణని
ర్నిద్రసముద్రుం డగు బల
భద్రుం డగ్రజుఁడు నెగడె భద్రయశుండై.

142


చ.

తలప ననంతుఁడై మొదల దాస్యములెల్ల లభించి పిమ్మటన్
సలలితరామచంద్రు ననుజన్ముఁ డనందగి లక్ష్మణాఖ్యచే
నెలకొని యగ్రజుం డలర నిత్యసపర్య లొనర్చి గాదె యీ
యలఘుఁడు కృష్ణమూర్తి కిపుఁ డగ్రజుఁడై చెలువొందె వేడుకన్.

143