పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

స్వీయ చరిత్రము.


ఆచిన్నది యిల్లుదాటిన నాలుగైదునిమిషముల కెల్లను తల్లిమొదలైనవా రామెతరలిన సంగతి కనిపెట్టి చుట్టుపట్ల వెదక నారంభించిరి. ఆమె యిందు నిమిత్తమే పోయినదని వారు గ్రహించి బంధువులతోడను పొరుగువారితోడను పరుగెత్తి యన్ని దారులను వెదకి యెందునుగానక తిరిగివచ్చిరి. అప్పుడు వారందఱును న్యాయవాదులతో నాలోచించి తమ నగలెత్తుకొని పాఱిపోయినదని దొంగతనపు నేరము నారోపించి యాచిన్న దానిమీఁద పోలీసువారి వద్ద ఫిర్యాదుచేసి యామెను పట్టుకొనుటకయి యారాత్రియే వారంటు పుట్టించిరి. ఆవారంటు నిచ్చినది మామిత్రుఁడైన గుమ్మడిదల మనోహరముపంతులు గారే. ఆయన వారంటు పట్టుకొనిపోయెడుభటునితో ముందుగా కాకినాడకు పోయి నాలుగైదుదినము లక్కడనుండి రామకృష్ణయ్యగారి యిండ్లలో దేనిలోనైన నాచిన్నది దాచఁబడినదేమో విచారించి యక్కడలేదని రూఢిగా తెలిసినపిమ్మటనే రాజమహేంద్రవరమునకు పోవలసినదని చెప్పి, రహస్యముగా నాకాదినముననె తెలియునట్లు మనుష్యునిఁబంపెను. నాకీవర్తమానము పాఠశాలలో నుండఁగా మఱునాటి మధ్యాహ్నము తెలియవచ్చినది. ఆసమాచారము తెలియరాఁగానే నేను సెలవుగైకొని వారంటు తప్పించుటకయి పోలీసు స్యూపరింటెండెంటుగారి కార్యస్థానమునకు పోఁగా, ఆయన కాకినాడకు పోయినట్టు తెలిసినది. అప్పుడింటికివచ్చి చిన్న దానిని భద్రపఱిచి, పోలీసిన్స్పెక్టరును గలిసికొని నేను మరలవచ్చు పర్యంతమును చిన్న దానిని వారంటుమీఁద పట్టుకొనకుండునట్టు దిట్టపఱిచి, వెంటనే బండిమీఁద ధవళేశ్వరము పోయి పడవయెక్కి మఱునాటి మధ్యాహ్నమునకు కాకినాడచేరితిని. అక్కడ విచారింపఁగా స్యూపరింటెండెంటు ఉప్పుకొటారులను పరీక్షించుటకయి పెనుగుదురు గ్రామమునకుపోయినట్టు తెలిసినది. అప్పుడు చింతమఱింత యెక్కువయయి భోజనము లేని విచారమును మఱచి పెనుగుదురు పోవుటకయి ప్రయత్నించుచుండఁగా, పోలీసు స్యూపరింటెండెం టంతకుముందే మరల వచ్చి కాలువలోని తమ పడవలోన్నున్నట్టును, గంటసేపటిలో చామర్లకో