182
స్వీయ చరిత్రము.
ట్టణమునుండి యనేకమిత్రులు వేంటనే చెన్న పట్టణము రావలసినదనియు వచ్చి యచ్చట నీవేఁడిచల్లాఱక మునుపే కొన్ని యుపన్యాసములుచేసినపక్షమున తప్పక కొన్ని వివాహములగుననియు నన్నా హ్వానముచేసిరి. వారికోరిక చెల్లించుట కర్తవ్యమనియు తన్మూలమున వితంతువివాహపక్షము బలపడుననియు నాకు తోఁచినందున, ఇక్కడనెవ్వరికి నేవిధమైన యిబ్బందులును గలుగకుండ తగినయేర్పాటులుచేసి, యొకవంటబ్రాహ్మణుని వెంటఁగొని చెన్నపట్టణమునకుఁ బోయి యక్కడకొంతపనిచేసి శీతకాలపు సెలవుల కడపట జనేవరు 16 వ తేదిని పాఠశాల తెఱచులోపల మరల రాజమహేంద్రవరమునకు రానిశ్చయించు కొంటిని. అప్పుడు నల్లగొండ-కోదండరామయ్యగారు తానా వఱకు చెన్నపట్టణము చూచియుండక పోవుటచేత చూడవలెనన్న యభిలాష తనకు విశేషముగాఁగలదనియు, వంటబ్రాహ్మణునకు బదులుగా తన్ను తీసికొనిపోయెడు పక్షమున తానే నాకు వంటచేసిపెట్టెదననియు, నన్నడుగఁగా నేనది యనుగ్రహముగా నెంచుకొని యాయనకోరిక నంగీకరించితిని. అప్పుడు చెన్న పురికిఁబోవ నావిరిబండ్లును నినుపదారులునులేవు. పడవమీఁద కాలువపయి నొక్కదినము ప్రయాణముచేసి కాకినాడచేరి, అక్కడనుండి వారమున కొక్కసారిపోయెడు పొగయోడలమీఁద సముద్రముపైని రెండుదినములు ప్రయాణముచేసి చెన్న పురిచేరవలెను. కోదండరామయ్యగారిని వెంటఁబెట్టుకొని బైలుదేఱి డిసెంబరు నెల 29 వ తేదిని కాకినాడలోఁ బ్రవేశించితిని. పొగయోడ బైలుదేఱెడు 30 వ తేదిని గాలివాన యారంభమయ్యెను. అటువంటి సమయమున సముద్రముమీఁద పోవలదని పైడా రామకృష్ణయ్యగారు మొదలైనవారు నన్ను బహువిధముల ప్రార్థించిరి. ఒక్కసారి నిశ్చయముచేసి కొన్నతరువాత పట్టినపట్టును విడిచెడుస్వభావము కలవాఁడను కాకపోవుటచేత నామిత్రుల హితవాక్యములు వినక మౌర్ఖ్యముతో నాటిమధ్యాహ్న మాగాలి వానలోనే పడవయెక్కి నాసహచరుని తోడఁ గూడ పొగయోడయొద్దకు పోవబైలుదేఱితిని. అప్పుడు జంఝామారుతము ప్రచండముగా వీచుచు సంతత