పుట:Sukavi-Manoranjanamu.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
విరాటపర్వము (1-10)
సీ.

మజ్జనకుండు సన్మాన్య గౌతమగోత్ర
             మహితుండు భాస్కరమంత్రితనయుఁ
డన్నమాంబాపతి యనఘులు కేతన
             మల్లన సిద్ధనామాత్యవరులు
కూరిమి తమ్ముఁడు గుంటూరి విభుఁడు కొ
             మన దండనాథుండు మధురకీర్తి
విస్తరస్ఫారుఁ డాపస్తంబసూత్రప
             విత్రశీలుఁడు సాంగవేదవేది
యర్థిఁ గల వచ్చి వాత్సల్య మతిశయిల్లు
నస్మదీయప్రణామంబు లాచరించి
దుష్టి దీవించి కరుణార్ద్రదృష్టిఁ జూచి
యెలమి నిట్లని యానతి యిచ్చె నాకు.

69
ఈ పద్యమందు-అన్నమాంబ, సిద్ధనామాత్యుడు, కొమ్మన దండనాథుడు- అని ప్రయోగింపబడినది. 70
అరణ్యపర్వము (7-469)
సీ.

భవ్యచరిత్రుఁ డాపస్తంబసూత్రుండు
             శ్రీవత్సగోత్రుండు శివపదాబ్జ
సంతతధ్యానసంసక్తచిత్తుఁడు సూర
             నార్యునకును బోతమాంబికకును
నందనుం డిల పాకనాటిలో నీలకం
             ఠేశ్వరస్థానమై యెసకమెసఁగు
గుళ్లూరు నెలవున గుణగరిష్ఠత నొప్పు
             ధన్యుఁడు ధర్మైకతత్పరాత్ముఁ
డెఱ్ఱనార్యుఁడు సకలలోకైకవిధితుఁ
డైన నన్నయభట్టమహాకవీంద్రు
సరససారస్వతాంశప్రశస్తి తన్ను
జెందుటయు సాధుజనహర్షసిద్ధిఁ గోరి.

71