పుట:Sukavi-Manoranjanamu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కాశీఖండమందు గురుత్వమునకు నీ రెండు పద్యము లుండగా కొందఱు లాక్షణికులు (1–29)
మ.

జయధాటీసమయంబులన్ విలయఝంఝామారుతాడంబరా
న్వయరంహఃప్రవిజృంభమాణఘననిస్సాణోగ్రభేరీస్వనం
బయి యొడ్డాది భయంకరోడ్డమరుశౌర్యంబైన శ్రీ రెడ్డి దొ
డ్డయ యల్లాడ నృపాల రాహునకుఁ బిట్టల్లాడ దిక్చక్రముల్.

45
(అను) ఈ పద్యము తేలబలుకుటకు లక్ష్యము వ్రాసినారు. ఈ పద్యము, పై రెండు పద్యముల మధ్య నున్నది. వారి కంటికి నిది మాత్రము కన్పించి యా రెండు పద్యములు నెందుకు కనుపించక పోయెనో తెలియదు. 46
హల్లుకు
హుళక్కి భాస్కరుని చాటుధార
క.

అప్పులిడు నతఁడు ఘనుఁడా
యప్పు డొసఁగి మఱలఁ జెందు నాతఁడు రాజా
చెప్పఁగవలె సాహిణి మా
రప్పను దానమున ఘనుడు రాజు నటంచున్.

47
తెనాలి రామ[1]కృష్ణుని చాటుధార
క.

చిన్నన్న ద్విపద కెఱుఁగును
పన్నుగ పెదతిరుమలయ్య పదముల కెఱుఁగున్
మిన్నందిమ్రోసె నరసిం
గన్న కవిత్వంబు పద్యగద్యశ్రేణిన్.

48
శ్రీనాథుని కాశీఖండము (4-106)
గీ.

అనిన విని సోమయాజి కోపాగ్రహమునఁ
దత్తిరింపుచు వడి సోమిదమ్మఁ బలికె

  1. ‘కృష్ణమ్మ’ అని మూ. ప్ర. లో ఉన్నది.