పుట:Sringara-Malhana-Charitra.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మునుఁగును బాతకంబులను ముట్టినమాత్రన పోవుఁ బుణ్యముల్
పనివడి దానియూర్పుపయిఁ బాఱిన నాయువణంగు దానికా
ల్గనఁగ నొకింత దాఁకినను గాంచును జెట్ట సురేంద్రుఁ డేనియున్.


క.

ఎన్నివ్రతంబులు సల్పిన
నెన్నియుపాసంబు లున్న నిలఁ దీర్థంబుల్
యెన్నేనాడినఁ గానీ
కన్నను దోషంబు విధవఁ గలలో నైనన్.


క.

తోషింప నిజకుటుంబముఁ
బోషించుచు నతిథిపూజఁ బూన్చుచు గరుణా
న్వేషుండగు పుణ్యంబున
కీషన్మాత్రంబు సరియె యెన్నేఁగ్రతువుల్.


క.

కులసతి శిశువులుఁ దానున్
దలమొలకును లేక నలిగి దైన్యపడంగాఁ
దలఁపకయుండినదోషము
కులకోటుల నరకమునను గొని మునిఁగించున్.