పుట:Sringara-Malhana-Charitra.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇట్లు పుష్పసుగంధి నృత్యంబు సల్పుటయు నద్దేవదేవుస్థానికులు దొరలు పౌరలు కనకాంబరాదు లపరిమితంబుగాఁ గట్టనిచ్చిన మేళంబులవారుం దానును నందుకొనుచు నుత్సాహంబున మదనసేన నిజనివాసంబున కరిగినఁ దక్కినవారలు యధేచ్ఛం జనిరి. మలహణుం డప్పుష్పగంధిహృదయంబుఁ దెలియం దలంచి యద్దేవదేవుని యుద్యానవనప్రాంతంబునఁ బథంబుఁ గాచుకొని కనుమఱుఁగున నుండె నప్పుష్పసుగంధి మలహణుం జూచువేడ్క భానుమతియనుచెలియుం దానును నొక్కవటవిటపిప్రదేశంబున నిలిచి నిట్టూర్పు నిగుడించుచుఁ దమకులంబు నిందించుచు దుఃఖావేశంబున నిట్లనియె.


క.

ఎఱుకలు మాలిన యేభ్యపు
మొఱకులు గడునొసఁగుదానములు నతికష్టుల్
పఱిచిన పాటులఁ బడిపడి
నరమగువేశ్యలకు వేఱునరకము గలదే.