పుట:Sringara-Malhana-Charitra.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ్ఛారతి నేలుకృష్ణుఁ డనిశంబు సుఖాఢ్యునిఁ జేయుఁ గామినీ
మారునిఁ జుండిరామయకుమారునిఁ గాళనమంత్రిశేఖరున్.


ఉ.

“అంబుజసూతి, నీవు భువనావలిఁ బ్రోడవు నాదు వీణ భా
వంబున నాలపించు”మని వాణి హసం బొనరింపఁ బోలు ని
త్యంబును సామగానముల నభ్యసనం బొనరించుధాత నె
య్యంబునఁ జుండికాళనఁ జిరాయురుపేతునిఁ జేయుఁ గావుతన్.


ఉ.

నిండి మహామునీశ్వరులు నిర్జరకోటులుఁ జూచుచుండఁగాఁ
దుండమునందు నందుకొని తోరపుఁ బండులుఁ బిండివంటలున్
దండిగఁదించు మించి తలిదండ్రులకున్ బ్రమదంబుఁ జేయు వే