పుట:Srinadhakavi-Jeevithamu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

242

శ్రీనాథకవి

అల్లాడ దొడ్డ భూపతి విజయ ధాటి,

వేమవీరనృపతులకు సోదరులైన దొడ్డనృపతీయు, అన్న సృప తియు సేనాపతులుగ నుండి రాజ్యము విస్తరింపఁ జేయుట యందన్న లకు దోడ్పడుచుండిరి. వీరిలో దొడ్డ భూపతి స్వారి చేయుట యుం దాఱి తేరిన రౌతుగ నుండెను. అనేక జయములచేతఁ బ్రఖ్యాతి గాంచెను. ఇతఁడు గుఱ్ఱము నెక్కి స్వారి చేయుచు నిరువది నాలుగు మూళ్ళ మేర భూమిని దాటించి యశమును గాంచిన వాడని కాశీ ఖండములోని యీకింది పవ్యము చాటి చెప్పుచున్నది.


 « మ. హరిదాటించె బురోపకంఠమున వహ్వాళి ఏ దేశంబునం
దరు చేయళ్ళయ 'రెడ్డి నందనుఁడు దొడ్డయ్యు క్షమాధీశ్వరుం
డిరువై నాలుగు మూళ్ళ 'మేర యది పోలెక్కింపఁగా నేల య
ధరణీ సాధు వికీర్తి దాటె గడునుద్దడించి బాహ్మాండమున్

.


ఈ గుఱము పేరు 'రాజకుంజరసింహం బనీ నిశ్శంక కొమ్మన తన శివలీలావిలాసమను గ్రంథమున


 మ. ఆరు దై యళ్ళయ దొడ్డ భూవిభుఁడు నాహారోహరేవంతుడిం
పరుజారవ్వడి మూలగూరి కడ వాహ్వాళిస్థలిన్ రాజుకుం
జర సింహంబను వారువంబును యదృచ్ఛాలీల దాటింపఁడే
తిరమై యిర్వదినాల్గు మూళ్ళ నిడుపు త్సేకంబు చే యెత్తు గాన్ .

ఈ దొడ్డా రెడ్డి చిల్క సముద్రము వఱకు గల దేశమునుజయించి
జయస్తంభములు నాటించినట్లుగా . నీ క్రింది పద్యమునఁ జెప్పి
యున్నాఁడు.

<poem>“, ఔరాయళ్లయ రెడ్డి దొడ్డ వసుధాధ్యతుండు ధాటీ చమూ
భేరీ భాంకృతిఘోరఘోషమున నీర్భేదించె నొడ్డాది శృం
గారం కోటయు లోతుగడ్డయును నుద్ఘాటించే నత్యుద్ధతిన్
క్షీరాంబోధిత టంబునన్నిలిపె డిక్సీమా జయస్తంభరల్ .,

.