తమున కొన్ని భాగములనుమాత్రము విని తృప్తినొందువారి కొక సందేహము తోచవచ్చును. జీవాత్మయు, పరమాత్మయు వేరుకావు. రెండును ఒకటేఅను మతము సత్యమైనదయిన యెడల నింద్రియముల నడచుట మొదలయిన యీశ్రమతో గూడిన పద్ధతులెందుకు? తానే బ్రహ్మమని తెలిసినతోడనే చింతలేకయుండవచ్చునుగదా !
ఇది సత్యమేకాని, ఇది దృష్టిని పొరబెట్టునట్టి అసత్య భావము. దీనిని విడువవలెను. అద్వైతవేదాంతమున చెప్ప బడిన అవిద్య యట్టిసామాన్యమైన 'టాకీ' దృశ్యము కాదు. కన్ను, చెవి, ముక్కు, ఎల్లయింద్రియములు, అంతరంగమగు మనస్సు, బుద్ధి, - అన్నిటినావరించియున్న ఈ యవిద్యఅను నది, దేహమును, బుద్ధిని, ఆత్మను, ఆవరించి యన్నిటియందును కలిసినిలిచియున్నది.
ఇది యొకపక్షమునకుచెందిన భావనయని చెప్పిన
మాత్రమున ముగిసిపోదు; శరీరము, మనస్సులోనున్న,
యొక్కొక్క సూక్ష్మాణువును తాకి, మేల్కొల్పి మలినమును
తొలగింపవలసినదిగానున్నది. దానికి నిష్ఠ, ఇంద్రియనిగ్రహము,
నిస్సంగత్త్వము అన్నియు కావలెను. మాయనుండి
దృష్టిని విడిపింపవలెనని సత్యమును తెలిసినంతమాత్రము,
సరిపోదు. మాయనుండి తప్పుకొనవలెనని తెలియుట ఒకటి.
తెలిసినపిదప తప్పుకొనుట మరియొకటి. నేను తెల్లవారు