పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/539

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కిష్కింధా కాండము

501

రామునికార్య మా - రడిఁ బోయె మొదట
భూమిజకై పక్షి - పుంగవుఁడైన
యల జటాయువురీతి - నన్యోపకార
ములకునై యీదేహ - ము లొసంగలేదు,
ఊరక ప్రాణంబు - లొల్లక పొలియుఁ
గారణంబయ్యె నే - కైవడినైన
కార్యార్థమై - ప్రాణముల్ విడువఁ
గామింప నుత్తమ - గతులు చేకూడు.”
అని "తండ్రిపనుపున - నడవికి రాక,
మునుకొని సుగ్రీవు - మొగము చూడంగఁ5430
దమకుఁ బోరానియం - తయుఁ" గథాసరణిఁ
గ్రమముతో వినఁబల్కి - "కైకేయి వలన
వానరప్రభులకు - వచ్చెగా! యిట్టి
హాని" యంచును "జన - కాత్మజ కొఱకుఁ
గనిపించుకొని పుణ్య - గతులకు నేఁగె
ననఘుఁడైన జటాయు "- వనుచు నీరీతిఁ
బలుమాఱు నార్తుఁడై - పలుకు నంగదుని
పలుకు లాలించి సం - పాతి యిట్లనియె.

-: సంపాతి వానరులతో సంభాషించుట :-

మీరెవ్వరయ్య ? యే - మి నిమిత్తముగను
శ్రీ రాము దేవేరిఁ - చెఱవట్టుకొనియె5440
దనుజనాయకుఁడు? నా - తమ్ముఁడైనట్టి
ఘనుఁడు జటాయు వే - క్రమమునఁ బడియె?
రాముని తెఱఁగు స - ర్వము వినవలతు