పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/515

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కిష్కింధా కాండము

477

పాడఱుగాకని - పదరి శపింప
నాఁడాదిగా నిర్జ - నస్థలం బగుచు
నున్నది గాన వా - రోడక సీత
నన్నెలవుల నెల్ల - నారసి చూచి
కానక యొక్క రా - క్షసుని వీక్షించి
వానరవీరుల - వాడును జూచి
"ఎక్కడివారు? మీ - రేఁటికి వచ్చి
చిక్కితి రిపుడు నా - చేతిలోపలికి 4850
పోనిత్తునే!” యని - పొడవుగా భయద
మైనట్టి తనదు బా - హాయుగళంబుఁ
జాఁచుక వచ్చు రా - క్షసుని వీక్షించి
కొంచవారక వాలి - కొడు కాగ్రహించి
చేకొద్ది రొమ్ము వ్రే - సిన సొమ్మసిల్లి
మోకరించుక ప్రాణ - ములు వోయి పడియె.
దానవుఁ బొరిఁగొన్న - తమ యువరాజు
వానరులెల్ల గై - వారముల్ చేసి
యాచుట్టు నెళవుల - నవనిజ వెదకి
యేచోటఁ గానక - యెల్లరు గూడి 4860
యలసి యాకెలని మ - హామహీరుహము
చలువ నీడను వరు - సను గూరుచుండి
తనవారితో నంగ - దకుమారకుండు
తనువెల్ల నలసి కొం - దలముతోఁ బలికె.
"మన చేతనైన క్ర - మంబున రాజు
చనుమన్న చోటికిఁ - జని చూడుమన్న
చోటులు కలియంగఁ - జూచి వేసరక