పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/450

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

412

శ్రీరామాయణము

యిసుమంత గనుపట్టు - నిసుముదిన్నెలను
పసమీరెఁ జూడుమీ - పంపాస్రవంతి
జడివాన లుడివోయి - శరదవసరము
పొడచూపె దండెత్తి - పోవురాజులకు,


-: శ్రీరాముఁడు లక్ష్మణునితో సుగ్రీవుఁడు తమ కార్యము మఱచినాఁడని తెలిపి, కిష్కింధకుఁబోయి యాతనికి చెప్పవలసిన మాటలను చెప్పుమనుట :-

ఇది వేళయని మది - నెఱిఁగియు రాక
మదిలోన మనల నే - మఱి భానుసుతుఁడు
నూరక నగరిలో - నున్నాఁడు తనకు
నూఱేండ్లుగా దోఁచె - ను నిమిషమైన
వనములలో చక్ర - వాకంబుఁ గూడి
చను జక్కవమిటారి - చాడ్పున సీత3290
నావెంట రాఁగ ని - న్నాళ్లు నుద్యాన
భావమై యుండె నీ - భయదకాననము
ఇలయేల నొల్లక - యిల్లాలిఁ బాసి
కలఁగుచునున్న నా - గతి విలోకించి
దయఁ జూడఁదగుఁగాక - తనవంటివాఁడు
నియతి యేమఱియుండు - నే నన్ను మఱచి?
తనవంటి యాశగా - దా వీరిదనుచుఁ
గనలేక యున్నాఁడు - కాముకుండగుచు
వానకాలము దీర్చి - వత్తువుగాక
వానరబలముతో - వలదిప్పుడనుచుఁ3300