పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కిష్కింధా కాండము

397

వానకాళ్ళును జెలు - వము హెచ్చ విరియఁ
బూనియున్న కదంబ - పుష్పగుచ్ఛముల
తమ్ములపై నాడు - తమిమాని కొదమ
తుమ్మెదల్ విపినవీ - థుల వచ్చి వ్రాలె.
రాజులకెల్ల నూ - రటలు గల్పించి
తేజోభివృద్ధి దం - తిశ్రేణి కొసఁగి
సింగంబులను దరి - సీమలనుంచి
పొంగి యాడెడు కలా - పులఁ బ్రోదిచేసి
వనముల కెల్ల జీ - వనము గల్పించి
వనజాతములకుఁ జె - ల్వము గలిగించి2930
యిలకెల్ల నానంద - మిచ్చె నౌారౌర!
జలదాగమము ఋతు - స్వామి గావలయు!
వాహినీతతి పతి - వ్రతలు దారగుట
యూహించి ఘోషించె - నుదధియుఁ బోలి
తెరువరుల్ ప్రాణభీ - తినిఁ బోవరాక
తెరువులు వెదక న - దీకూలములను
పట్టముల్ గట్టు భూ- పతులకుఁ బోలి
దట్టంబులగు జల - ధర కలశముల
నగములనెల్ల ను - న్నతిఁ దీర్థమార్చె
నగవైరి యనఁగ వా - నలు విలోకింపు!2940
చెలువేది? దిక్కులు - చీకటుల్ గ్రమ్మ
తలచూపకున్నాఁడు - తపనుఁడు నేఁడు,
రాజులు తమపేరు - రమ్ముల మీఁద
రాజిల్లు ముక్తాస - రములుంచి నట్లు
సెలయేరు మొత్తముల్ - శిఖరభాగముల