పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కిష్కింధా కాండము

365

దయితలందఱు మూగి - తనమీఁద వ్రాల
నయశాలి వాలి ప్రా - ణంబులు విడిచె.

-: వానరులు తారాసహితముగ వాలిమృతికై శోకించుట :-

అపుడు వానరులు మ - హారోదనంబుఁ
గృపణభావమునఁ గి - ష్కింధ చలింపఁ
గావింప గిరివని - కందరావళుల
భావింప మున్నంటి - ప్రభమాసియుండ 2170
హితబాంధవులు చేరి - "యెవ్వఁడీ వనము
లతిశయంబగు - నాజ్ఞ నరయ శక్తుండు?
ఈవాలియే కాక - యిఁక నేఁటి బ్రదుకు?
పోవుద మెందైన - పుడమిపై వలస
గోలభుఁడును యక్ష - కుంజరుతోడ
నాలంబుఁ బదియు నే - నబ్దముల్ చేసి
పదియునాఱవయేఁట - బట్టివధించె
నిదుర యాహారంబు - నిరసించి వాలి!
ఇంతటివాఁడింక - నెవ్వఁడు పాప
మెంత చేసితిమొ నేఁ - డితని బాసితిమి?" 2180
అనిపల్క దారాదు - లందఱు తమదు
పెనిమిటిపై వ్రాలి - బిట్టుశోకింప
లతలతోఁ గూడి మూ - లంబుతోఁ బెకలి
క్షితి వ్రాలి భూజంబు - చెలువున నున్న
వాలి మొగంబుపై - వ్రాలి యా తార
యాలింగనము చేసి - యడలుచుఁ బలికె.