పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

293

కిష్కింధా కాండము

కతమిచ్చు కొంగు బం - గారముల్ గావె?
మాటాడు” మనిన ల - క్ష్మణకుమారకుఁడు
పాటించి పవవసం - భవున కిట్లనియె.
"నీచేత సుగ్రీవు - ని తెఱంగు మాకు
గోచరించెను చెల్మిఁ - గోరి వచ్చితిమి.
అతనితో నీవాడి - నట్టి చందమున
హితమాచరించెద - మినకుమారునకు430
మానుతు మిట మీద - మదివిచారములు
భానునందనుఁ డాప్త- బంధుండు మాకు.”
అని పల్కుటయుఁ దన - యధిపతికార్య
మనుకూలమయ్యె కృ - తార్థుఁడనైతి
జెలిమికి నగు చింత - సేయుదు ననుచుఁ
దలంచి యాపవమాన - తనయుఁడుప్పొంగి

రామలక్ష్మణులు పంపాసరోవర ప్రాంతాగమన కారణమును విని హనుమంతుఁడు
                 వారలను సుగ్రీవుని యొద్దకు గొనిపోవుట :-

"చేకూడె వీరితోఁ - జెలిమి నాస్వామి
కే కార్యమో వీర - లీడేర్పఁదలఁచి
చెలిమి యాశించి వ - చ్చిరి వీరలొక్క
బలవంతుతోఁ జాలఁ - బగఁ గొన్నవారు.440
అదియుఁ దీర్చెదమని" - యాత్మ భావంబు
ముదితాత్ముఁడగుచు రా - మునికి నిట్లనియె.
"అయ్య! యీ ఘోరమై - నట్టి కానలకు
నియ్యిరువురు మీర - లేల వచ్చితిరి