పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

285

కిష్కింధా కాండము

-: ధనుర్బాణులగు శ్రీరామలక్ష్మణులఁ గాంచి వాలిపంపినవారలనుగా సుగ్రీవుడు చింతించి భీతిల్లుట; హనుమంతుండు సయుక్తికముగా వాని సంశయమును నివారించుట :-

భీతిల్లి యార్తిచే - బెదరి కలంగ
నాతరి నితరులై - నట్టివానరులు
వెఱచి పాఱిన కపి - వీరుఁడు దేవ
గిరి సమానుండు సు - గ్రీవుఁడు నిలిచి
యాజానుబాహుల - నలఘువిక్రముల
రాజీవనేత్రుల - రవివంశమణుల
విజితేంద్రియుల ముని - వేషధారులను
గజగమనులను రా - కాచంద్రముఖుల 240
జక్కనివారిని - జతయైనవారి
నెక్కడ కనివిని - యెఱుఁగనివారి
బాణబాణాసన - భర్మకృపాణ
పాణుల సత్యసం - పన్నుల రామ
సౌమిత్రులను జూచి - చాల శంకించి
తామరసాప్తనం - దనుఁడు చలించి
వెఱచినవాఁ డౌట - వింతచూపగుట
హరియౌట నిలిచిన - యచ్చోట నిలక
మనసు నిల్కడ లేక - మలయుచోనెల్ల
తనుఁగాచి వెంట ప్ర - ధానులు రాఁగ 250
హితులైన తన వాన - రేంద్రులఁ జూచి
కృతనిశ్చయమున సు - గ్రీవుఁ డిట్లనియె.