పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆరణ్యకాండము

245

వెన్నీక రణములో - విడిచె ప్రాణములు!
శూరులు ధార్మికుల్ - సూనృతపరులు
ధీరులు నున్నారు - తిర్యగాత్ములును 5840
నితని దహింపుద - మిపుడని" కాష్ట
వితతి యమర్చి పై - విహగేంద్రు నునిచి
మథనాగ్ని వేగ ల -క్ష్మణుఁడు దెచ్చుటయు
వ్యధనొందుచును రఘు - వర్యుఁ డిట్లనియె.
“పక్షిపుంగవ! నీకు - పరమధార్మికులు
దీక్షచే యాగముల్ - దీర్చు పుణ్యులును
ఆహితాగ్నులు కామి -తార్థదాతలును
సాహసాధికులును - చనునట్టిగతికి
నాయనుగ్రహముచే - నాచేతనైన
యీయగ్నిసంస్కార - హేతువుచేత 5850
నీవు వొందుదువని” - నీడజస్వామి
నావేళ దహియించి - యచ్చోటినదిని
స్నానంబుగావించి - తర్పణక్రియలు
పూనికఁ దీర్చి యా - పురుషరత్నములు
మమతతో వనమృగ - మాంసపిండములఁ
గ్రమమున నిడి మచ్చి - కను బ్రీతుఁ జేసి
క్రమ్మఱ మునిగి రా -ఘవులు శోకించి
యమ్మేరఁ బాసి వా - రవ్వలఁ జనగ
నాయెడ బంధుకృ- త్యంబుగా వారు
సేయు సంస్కారవి - శేషంబు వలన 5860
నమరత్వమునఁ బొంది - యచ్యుతపదవి
నమరె జటాయు వ - య్యర్కవంశజులు