పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

230

శ్రీరామాయణము

—: సీత నెవ్వఁడో పురుషుఁ డెత్తుకొనిపోయెనని రాముఁడు సకలజగత్తుపై కోపముఁబూనుట :—

ప్రాణనాయకి సీత - పట్టున నాకు
ప్రాణపర్యంతమౌ - పగ గల్గె నిపుడు!
మనసీత యడుగులు - మగవాని యడుగు
లెనసియున్నవి కంటె - యీప్రదేశమున
మ్రింగెనొ చంపెనొ - మేదినీతనయఁ
బొంగిలి నెత్తుక - పోయెనో వాఁడు 5480
నాతోడి పగపూని - నమ్మి ప్రాణములు
పాతకుఁ డెట్లు డాఁ - పగ నెంచెనొక్కొ?
దయచేత సకలభూ - తములందు నేను
చెయిగాచి యుండుట - చింతింపలేక
యెంతురో యింద్రాదు - లీతనిచేత
నింతయు గారని - హీనసత్త్వునిఁగ!
ధార్మికాగ్రణియయ్యు - తలమోచి యేను
ధర్మంబె చేపట్టి - దయఁగల్గి మెలఁగ
నట్టిధర్మమువచ్చి - యడ్డంబుగాక
పట్టియిచ్చెను సీతఁ - బగవారిచేత! 5490
ఇప్పుడే విల్లంది - యెల్లలోకములఁ
జప్పుడు గాకుండ - క్షణములోపలను
హరిహయబ్రహ్మరు - ద్రాదులతోడ
శిరపరంపరలతోఁ - జమరివైచెదను!
వనపర్వతద్వీప - పతియైన వసుధఁ
దునిమివైచెద నొక్క - తూపు సంధించి
మూఁడులోకంబుల - మొనచేసి యెదురు