పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

91

సీ. ఆసన్న మరణార్థి యైన యతీశుండు కాలదేశములను గాచికొనఁడు

తనువు విసర్జించు తలఁపు జనించిన భద్రాసనౌస్థుఁడై ప్రాణపవను

మనసుచేత జయించి మానసవేగంబు బుద్ధిచే భంగించి బుద్ధిఁ దెచ్చి

క్షేత్రజ్ఞుతోఁ గూర్చి క్షేత్రజ్ఞు నాత్మలోపలఁ యాత్మను బ్రహ్మమందుఁ

తే. గలిపి యొక్కటి గారవమున, శాంతితోడ నిరూఢుఁడై సకలకార్య

నివహ మెల్లను దిగనాడి నిత్యసుఖము; నలయునని చూచు నటుమీఁద వసుమతీశ. (27)


వ. వినుమ ప్పరమాత్మయైన బ్రహ్మమునకుఁ దక్కకాల దేవ సత్త్వ రజ స్తమోగుణాహంకార నహత్తత్త్వ ప్రధానంబులకు సామర్థ్యంబు లేదు. కావునఁ బరమాత్మ వ్యతిరిక్తంబు

లేదు. దేహాదులం దాత్మత్వంబు విసర్జించి, యన్యసౌహృసంబు మాని, పూజ్యంబైన హరిపదంబున ( బ్రతిక్షణంనున) హృదయంబున నాలింగనంబుసేసి, వైష్ణవంబైన పరమ

పదంబు ( సర్వోత్తమం బని ) సత్పురుషులు దెలియుదురు. ఇవ్విధంబున విజ్ఞానదృగ్వీర్య జ్వలనంబున నిర్దగ్ధ విషయవాస నుండై క్రమంబున నిరపేక్షత్వంబున (28)


సీ. ఆంఘ్రిమూలమున మూలధార చక్రంబుఁ బీడించి ప్రాణంబు బిగియఁ బట్టి

నాభీతలముఁజేర్చి నయముతో మెల్లన హృత్సరోజము మీఁది కెగయఁబట్టి

యఈమీఁద నురమందు హత్తించి క్రమ్మఱఁదాలు మూలమునకుఁ దఱిమి నిలిపి

మమతతో భ్రూయుగ మధ్యంబుఁ జేర్చి దృక్కర్ణ నాసాస్య మార్గములు మూసి

తే. యిచ్ఛలేని యోగ యొక్క ముహూర్తార్థ, మింద్రియానుషంగ మింతలేక

ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి, బ్రహ్మమందుఁ గలియుఁ కౌరవేంద్ర ! ( 29 )


వ. మఱియు దేహత్యాగకాలంబున నింద్రియంబులతోడి సంగంబులు విడువనివాఁడు వానితోడన ( గణసముదాయ రూపంబుగు ) బ్రహ్మాండంబునందు ఖేచర సిద్ధి విహార

యోగ్యంబు నణిమాది సకలైశ్వర్య సమేతంబునైన పరమేష్టిపదంబుఁ జేరు. విద్యాతపో యోగసమాధి భజనంబు సేయుచుఁ బవనాంతర్గత లింగశరీరులైన యోగీశ్వరులకు

బ్రహ్మాండ బహిరంతరాళంబులు గతి యని చెప్పదురు. ఏరికిని గర్మంబుల నట్టి గతిఁ బొంద శక్యంబుగాదు. యోగి యగువాఁడు బ్రహ్మలోకంబునకు నాకాశపథంబునం

బోవుచు సుషుమ్నానాడివెంట నగ్నియను దేవతంజేరి జ్యోత్మిర్మయంబైన తేజంబున నిర్మలుండీ