పుట:Shrungara-Savithri-1928.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

85


నా వినినారొ యంటి ననినన్ బుడమిన్ రిపు లాక్రమించినన్
దావిగతాక్షు లైనతలితండ్రులతో వనిఁ జేరె నం చనెన్.


సీ.

అంతలోన విధాత నాదేవి నన్నును
                 బిలుప నంపినఁ బోయి కొలిచి యుండ
సావిత్రి బహ్మతో సత్యవంతునిమాట
                 కే మంటి వనఁ బెండ్లి కేటి మీఁదఁ
గద గండ మీపు డేమి మొదటి నారాయణు
                 చేతియొప్పపులేఖవ్రాతఁ జూడు
మనుచు ముందఱ నుంచఁ దనకుఁ గా నిది దిద్ది
                 మంచిసంప్రతుల వ్రాయించు మనియె
ననిన నది మేర గాదు నా కైన వ్రాసి
కొనెద నిప్పుడు మఱవక వెనుక నైన
స్వామి యుత్తరు విప్పింప వలయుననుచు
వ్రాసికొని మమ్ముఁ బొమ్మనె వనజభవుడు.


క.

అంతటను దేవి నాతో
వంత విడువు లేఖ బాగ వ్రాయించితి శ్రీ
కాంతునియుత్తరు వొక్కటి
యింతే యయ్యేని పుడమి కేఁగు మనంగన్.