పుట:Shrungara-Savithri-1928.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

75


లికుఁ డొకచిప్పలోపల తెలిం గలబంతి నడంచి యొక్కచి
ప్పకుఁ బయిఁ చూపెనో యెఱుపుబంతి యనం జెలు వొందె వింతగన్.


ఉ.

ఇంతకు నారదుండు మనయింటికి వచ్చునొ యేమొ నీమదిన్
వంతలు దీరు మంచిశకునంబులు గానఁబడెన్ బడంతి యిం
దింతవడిన్ జరించఁ దగ దింటికిఁ బోదము ర మ్మటంచునున్
గొంతటి యుక్తి యౌ ననుచుఁ గొమ్ములు సమ్మతి చేసి పిల్వఁగన్.


క.

సావిత్రి తనదునగరికి
నావెలఁదులతోడ మగుడి యచ్చట నెంతేఁ
దా వగఁ గుందుచు నారదుఁ
డీవేళకు రాఁ డటంచు నెంచుచు నుండెన్.


గీ.

అనిన మునినాథునకు ధర్మతనయుఁ డనియె
మౌనికులచంద్ర, నారదమౌని యిపుడు