పుట:Shrungara-Savithri-1928.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

అవధరింపుము పాండవేయాగ్రజునకు
ఋషివరుండు మార్కండేయుఁ డిట్టు లనియె
నటులు సావిత్రి సకలవిద్యలు గ్రహించి
తగినకాంతుని వరియింపఁ దలఁచు చుండ.


క.

ఒకనాఁ డనుఁగుంజెలు లా
ముకురాననతోడ నందముగను వసంతం
బొకటఁ దగెఁ గేలికావని
నకలంకం బగుచు నీదుయౌవనము క్రియన్.


మ.

పొలుపొందం జనుగుత్తులం దనరు నొప్పున్ మ్రోవి నందంద తే
నెలు చిందున్ గలకంఠరావముల నెంతే వింతగాఁ బర్వు నిం
పొలయన్ నెమ్మి నటింప నైన నొకటే యుక్తంబు గా దింతకున్
ఫల మై యుండదె బోటి యాయినకరస్పర్శంబు తాఁ గల్గినన్.