ప్రథమాశ్వాసము
17
నే మని పేరు నేనె వచియింపుదు మేనక యందు రందఱున్ శ్రీమహనీయుఁ డైనసురశేఖరుకొల్వున నున్న బోగపుం దామరసాక్షులం బిరుదు దాల్చినదాన జగం బెఱుంగఁగన్.
నలువ దా నెక్కునందల మంపి పిలిపించి వీణియ నాచేత విన్నమాట హరుఁడు నే వినిపించుదురుపదానకు మెచ్చి తొడమీఁదఁ గూర్చుండు మనినమాట హరి పిల్చి నాచేత నభినయంబును జూచి తనయొద్దఁ గొలువుండు మనినమాట నారదపర్వతుల్ పోరి తన్ లయకోస మై తారతమ్యంబు లడుగుమాట మున్ను వినియుందురే కదా నన్ను నేనె పొగడుకో రాదు గాక యోపుణ్యమూర్తి, యమరనాథుహుజూరుపాత్రముల కెల్ల గుండెలో గాల మనిపించుకొంటి నేను.