పుట:Shrungara-Savithri-1928.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

127


క.

నావుడుఁ దండ్రీ యౌ నని
తా వని కేఁగుటయు బడలితో వ్రాలుటయున్
దా వెగటుగఁ గల కనుటయుఁ
దా వచ్చుట దెలుప సాధ్వి తా నిట్లనియెన్.


సీ.

ఓమామ నారదుం డొకనాఁడు దెలిపె నీ
                 ఘనునకు నేఁటికి గండ మనుచుఁ
గాన నేఁ డితనితోఁ గాననంబున కేఁగి
                 నే నుండ నీతండు నిద్రవోవ
జముఁడు ప్రాణము గొంచు జరగ నే వెంటనె
                 చన దయచేసె నాజముఁడు నాకుఁ
కొన్ని వరములు మీకు నయనముల్ రాజ్య
                 మును గల్గ మాతండ్రి తనయులఁ గనఁ
దుదను నే నోము సావిత్రి తొడుక రాఁగ
నపుడు మనపాలి శ్రీకాంతుఁ డరుగుదెంచి
మీతనయుజీవ మిప్పించి మిగుల నన్ను
దయను దీవించి చనె నని తరుణి పలుక.


గీ.

పులక లొదవంగ నానందజలధిఁ దేలి
నిలిచి దంపతు లోతల్లి నీవు గలుగ