పుట:Shrungara-Savithri-1928.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

125


ఉ.

ఇక్కడ నాశ్రమస్థలిని వృద్ధులు పుత్రుఁడు రాక యున్కికిం
బొక్కుచు నాల్గుదిక్కులకు మోములు ద్రిప్పుచు బారఁ జాఁపుచున్
వెక్కుచు నోకుమార యని వేమఱు గొంతులు రాయఁ గూయుచున్
ఱెక్కలు దీయుపక్షు లన నిల్చి రిఁ కే మని తెల్ప నవ్వెతన్.


శా.

ఈలీలం బలవించుచున్ గరము లెంతేఁ జూపుచున్ మింటికై
యోలోకేశ్వర యోగజేంద్రవరదా యోప్రాణిసంరక్షకా
యోలక్ష్మీపతి మాకు నీవె శరణం బోతండ్రి మాపుత్రునిం
బాలుం గానఁగఁ జేయు మంధకుల మాపద్బాంధవా యం చనన్.


ఉ.

అంత వరప్రభావమున
నప్పుడె కన్నులు వచ్చి నల్దెసన్