పుట:Shrungara-Savithri-1928.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

119


వింతటినుండి పోయిన సహించను నీమన సంచుఁ బల్కి యో
యింతిరొ నీకు నీపురుషు నిచ్చితి నీ పతిభక్తి మెచ్చితిన్.


గీ.

వనిత వేయేండ్ల కైదువతనము గలిగి
యింట సంపద పూలచే రెత్తినటుల
కలిగి కొడుకులు మనుమలు కల్గి మనుము
తరుణి నానాఁటఁ దామరతంప రగుచు.


మ.

అని దీవించుచు శ్రీనివాసుఁ డటఁ దా నంతర్హితుం డైన వెం
టనె బ్రహ్మాదులు పోయి రంత నృపుప్రాణంబుల్ జముం డిచ్చి పో
యెను సావిత్రియు నాపతివ్రతను దా నెంతేని దీవించి యా
త్మనివాసంబున కేఁగె నం చనఁగఁ బ్రేమన్ ధర్మరా జిట్లనెన్.


గీ.

ఎంత భాగ్యవతియొ యెంచంగ సావిత్రి
యంతదేవిఁ గొలిచి యముని గెలిచె