పుట:Shrungara-Savithri-1928.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

109


వేదాంత మడుగుటల్ వెస నిల్పి గాయత్రి
                 చెలియ ర మ్మనుచు నవ్వలికి జరగ
రా రమ్ము రాఁగదే రావె రావో యంచు
                 నల్గొగంబులతోడ నలువ పిలువ
వచ్చెద నటంచుఁ దలగడవలను చేరి
యజునిచెవిలోన గుసగుసమని యటంచు
గొంత యేకాంతముగఁ దెల్పఁ గొదవ వినక
మునుపె తలయూఁచెఁ బోరాదుమనమటంచు.


క.

మఱి వినుఁ డని గాయత్రీ
సరస్వతులు తెలుప వినుట చాలును మీరే
మెఱుఁగ రిది మొదటిపుట్టువ
యరసినచో నాకు నేర మగు నే వెఱతున్.


గీ.

అనిన సావిత్రి బ్రహ్మతో ననియె నీవు
స్రష్ట వని యుండి మఱచుటే స్రష్టతనము
నోరు మూసినఁ బెడతల నుడువు దనుచు
నలువ ని న్నెంతు రాజసం బలరె నిపుడు.


క.

నీపాప మేమి సేయుదు
వాపాప మహిన్ జనింప నటు చేసినదే