పుట:Shrungara-Savithri-1928.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

93


తల్లీ ని న్నవుఁ గా దనన్ వెఱతు మాదారిద్ర్యముం బోయె నీ
వుల్లాసంబున నాదిలక్ష్మివలెనే యుండంగఁ జూడన్ వలెన్.


గీ.

అనినఁ బ్రియమంది సావిత్రి యహరహంబు
మగని నెడఁబాయ కాయత్తమామలకును
గొలువు సేయుచు మూఁడుపూటలు గ్రమించి
తెఱవ తరువాత నాలవదినమునాఁడు.


ఉ.

ప్రొద్దున లేచి తాఁ బసపు పూసుక కుంకుమ బొట్టు దీర్చి యా
పెద్దల కెల్ల మ్రొక్కి తనపెన్మిటికిం బరిచర్య సేయఁగాఁ
బ్రొ ద్దొకజాము సాగుటయు బోటిని బిల్చి ప్రియంబుతోడ నిన్
వద్దన లేము చాలు నుపవాసము పారణసేయు మిం కిటన్.


క.

అనినన్ మామకుఁ గోడలు
వినయంబున మ్రొక్కి రాత్రి విధుమండలముం