పుట:Shriiranga-mahattvamu.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

పంచమాశ్వాసము


వ.

అని కుశలప్రశ్నంబు గావించె, నప్పు డాపార్థివోత్తముండు.

157


సీ.

కమనీయతీర్థావగాహనోత్సాహులై
సంతసపడు మహాసంయములును
సదమలభూరుహచ్ఛాయల హరికధల్
రాణింపఁ జెప్పు పౌరాణికులును
సలలితసైకతస్థలముల హరిపూజ
గావించు పరమభాగవతవరులు
స్ఫటికోపలములందుఁ బ్రణవమంత్రాభ్యాస
రతచిత్తులగు పరివ్రాజకులును


తే.

భయదదుర్భరఘననిదాఘప్రతప్త
జంతుచాతకజలధరసమయ మగుచు
నఖిలలోకైకపావనమై దనర్చు
బిల్వతీర్థంబుఁ జూచి సంప్రీతి నొంది.

158


శా.

స్నానం బందొనరించి, నిత్యవిధు లోజం దీర్చి యచ్చోటి స
న్మౌనిశ్రేణికి భక్తి మ్రొక్కి, పిదపన్ వారందఱుం దోడరా
భూనాథుం డటఁ బోయి గాంచె మణివిస్ఫూర్జన్మహాగోపురా
గ్రానూనధ్వజతుంగమున్ గుహరమాయాభంగమున్ రంగమున్.

159


చ.

కనుఁగొని డాసి యచ్చట నకల్మషబుద్ధులు నిత్యసిద్ధులుం
జననుతసౌమ్యమూర్తులును సన్మణిభూషణనవ్యమాల్యచం
దనఘనతాభిరాములును, దామరసాక్షసమర్చనక్రియా
జనితసముత్సుకాత్ములును, శాంతులునై విలసిల్లు పుణ్యులన్.

160


ఆ.

రత్నభూషణాంబరమ్ములు ప్రత్యగ్ర
భూరివస్తుతతులఁ బూజ సేసి,
వందనం బొనర్చి వారిసంగతి రంగ
మందిరంబుఁ జొచ్చె మనుజవిభుఁడు.

161


శా.

సేవించెం జగదేకబంధుఁ గరుణాసింధున్ సమున్నిద్రరా
జీవాక్షుం గమలాఘనస్తనయుగశ్రీఖండసంవాసిత