పుట:Shriiranga-mahattvamu.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

చతుర్థాశ్వాసము


దవిలి భూలోకసారమై తనరు నగ్ర
హార మొకఁటిని దన పేర నారచించి.

211


క.

అలఘుతపస్వులు నుత్తమ
కులజులు నాచారపరులు గురుశుశ్రూషా
కలితులు, నానాధ్వరక
ర్తలు విద్యావిదులునైన ధాత్రీసురులన్.

212


ఆ.

మూఁడువేల నేర్చి, మొదవుల వారికి
వేయునేసి యొసఁగి, వెలయురత్న
భూషణాంబరములఁ, బొలుపారు కన్యల
దాసదాసికాన్వితముగ నిచ్చి.

213


వ.

ఒక్కశుభముహూర్తంబునఁ గార్తస్వరోపకరణరమ్యంబు లగుహర్మ్యంబుల
నాయాప్రదేశంబుల నతిధిజనంబులకు మనంబు లలర నభిమతపదార్థ
సంపన్నంబు లగునన్నంబులను శీతలఘనసారప్రముఖనిఖిలసురభి
ద్రవ్యసంవాసితానేకపానీయపరిపూర్ణకలశంబులం గలిగి యహిమకరనికరం
బులకుం జొరువ యీక మిగుల నిగతాళించు చలిపందిరులను
గల్పించి, కల్పోక్తవిధానంబునం బొసంగించి యచ్చటం గదలి ముక్తి
సీమంతినీసీమంతముక్తాఫలధామం బగు రంగధామంబున కరిగె. నయ్యవసరంబున.

214


ఉ.

జ్ఞానవిధూతకల్మషులు, శాశ్వతధర్మవిధిజ్ఞు, లచ్యుత
ధ్యానపరాయణుల్, ఘనదయాకలితుల్, సకలక్రియానుసం
ధానవిశారదుల్, పరహితవ్రతచిత్తు, లుదాత్తదివ్యతే
జోనిధు, లార్యసన్నుతవిశుద్ధచరిత్రులు తత్పదస్థితుల్.

216


క.

తనకు నెదు రరుగుదెంచినఁ
గని సంభ్రమవినయకౌతుకంబులు మది నె
క్కొన మ్రొక్కి విమలమణిగణ
కనకాదు లుపాయనములుగా నిచ్చి తగన్.

217