పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గద్వాల

57

తే.గీ|| శిష్టులకు సభయదమయి చెలఁగునెద్ది
కంకణాలంకృతం బయి కాంతి చెందు
సిద్ది శ్రీరామభూపాలు ముద్దుతనయు
కరము సద్దాని వర్ణింపఁ గలమె మేము 3

శ్రీ. శ్రీ. శ్రీ.


దుర్ముఖి సం॥ జ్యేష్ఠములో నర్సాపురములో జరగిన శతావధానములోఁ జెప్పిన 69 పద్యములలోఁ గొన్ని పద్యములు

శంకరాచార్యులు.

సీ||అడఁగించె నివ్వాఁడు కడ లేని మోహాంధకారము దివ్య జ్ఞానక లన
స్థాపించెనెవ్వాఁడు షణ్మతమ్ములను బౌద్ధాది దుర్మతముల హతము చేసి
రచియిం చెనెవ్వాఁడు బ్రహ్లాదులకశక్య మైన శ్రీసూత్రభాష్యాదికంబు!
నిర్జించే సెన్వాఁడు నిర్జర జ్యేష్ఠావ తారుఁ డై నట్టివిద్వాంసునొకని,
తే| గీ॥ నట్టియస్మన్మతత్తారణార్య బిరుదు
నవరసాంబశి వావతారాడ్యు బ్రమ
బోధపారీణు నానందపూర్ణు ససఘు
శంకరాచార్య వర్యుని సంస్మరింతు||

పరమేశ్వరుఁడు

.


ఉ॥ ఏమహనీయు ప్రాభవము నెట్టి మహాత్ములునై న జెప్పలే
రేమహనీయు తేజమున కెంతటి వారును నిల్వ నోవ రిం
కేమహనీయువర్ణ నము నెంతటి వారును జేయఁజాల రే
నామహనీయు నెంతుఁ బరమాత్ముని విఘ్న వినాశశీలు నిన్2

........................................................................................................

Sanscrit and Telugu vere of different metres. I was much pleased with the skill in versification and the wonderful power of memory displayed by the two Pandits,

(Stamp of Rajah in Parsbi.)

Rajah of Gadwal Samstan

GUDWAL. 9th March, 1896.

}