గౌతమీ గ్రంథాలయము
సంగ్రహ ఆంధ్ర
భాండాగారము" అనుపేరున వ్యవహరింపబడదొడగెను. అది పిదప పురమందిరమునుండి వేరొక ఇంటికి మార్చ బడెను. అప్పటికే మిక్కిలి ఉపయోగకారిగ నున్న ఆ పుస్తక భాండాగారము విద్యాధికులయిన యువకుల నాకర్షించినది. తదాదిగ యువకుల కృషివలన అది మిక్కిలి అభివృద్ధి నొంది తెలుగునాట ఉత్తమ గ్రంథాలయముగా పేరుగొన్నది.
అప్పటికే, ఆ భవనమునందే 'శ్రీ సూక్తిసుధానిధి వడ్డాది సుబ్బారాయకవి ' గారిపేర “వసురాయగ్రంథాలయము" అనుపేరుతో శ్రీ అద్దంకి సత్యనారాయణశర్మ గారిచే 1911 వ సంవత్సరమున స్థాపింపబడి వేరొక గ్రంథాలయము నడుపబడుచుండెను. ఈ రెండు గ్రంథాలయములకు పాలకవర్గమునకు సభ్యులు ఎక్కువమంది ఒక్క రే అయియుండుట వలన వారందరు, ఆ రెండుగ్రంథాలయములను కలిపి యొక పెద్దగ్రంథాలయ మొనర్చినచో, అది తప్పక ప్రజాదరమును ప్రభుత్వాదరమును పొందగలదని తలచిరి. ఆ రెండింటిని సమ్మేళన మొనర్చిరి. దానికి 'గౌతమీ గ్రంథాలయము' అను నామకరణ మిడి 1920వ సంవత్సరములో రెజిస్టరు చేసిరి.
అంతట ఆ గ్రంథాలయమున కొక నూతన గృహ నిర్మాణముచేయు తలంపు కార్యనిర్వాహకులకు కలిగెను. కొంతకాలమునకు వారి యత్నము సఫలమయ్యెను. వారు 1923 వ సం. రమున పట్టణమునకు మధ్యభాగమున నున్న ఒక విశాలభవనమును సంపాదించిరి. దాని యందు ఆ గ్రంథాలయము అభివృద్ధి చెందుచు వచ్చెను. ఇట్లుండ ఆ పట్టణముననే మరియొక దిక్కున శ్రీ కొక్కొండ వేంకటరత్నకవిగారిపేర కొందరిచే ఒక గ్రంథాలయము నడుపబడుచుండెను. గౌతమీగ్రంథాలయములో నొక కార్యకర్తయగు శ్రీ బోడపాటి సత్యనారాయణగారి కృషివలన ఈ 'రత్నకవి' గ్రంథాలయము ఈ గౌతమీ గ్రంథాలయమున విలీనము గావింపబడెను. ప్రజలవలనను, ప్రభుత్వమువలనను, సహాయసంపత్తి నొందుచు ఇది దిన దినాభివృద్ధి నొందసాగెను.
ఈ గౌతమీ గ్రంథాలయమున ప్రస్తుతము లిఖితతాళపత్ర గ్రంథములును, తదితరములయిన వ్రాతప్రతులును, సంస్కృతము, ఆంధ్రము, ఆంగ్లము, హిందీ, ఓడ్రము, కన్నడము, అరవము, అను భాషలలో ముద్రితములయిన గ్రంథములును కలిసి ఇప్పటికి సుమారు 50,000 గ్రంథము లున్నవి. ఇందు చరిత్రకు సంబంధించిన పుస్తకములు చాల కలవు. ఋగ్వేదమునకు తెలుగుపద్యరచనము (అముద్రితము) కలదు. కైఫీయతులును గలవు. ఇది పరిశోధన గ్రంథాలయముగ విశ్వవిద్యాలయములచే గుర్తింపబడినది.
ఇందలి గ్రంథము లిట్లు విభజింపబడినవి : (1) ఆర్ష గ్రంథములు - శ్రుతులు, ఉపనిషత్తులు, స్మృతులు, ధర్మ శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, మాహాత్మ్యములు, వ్రతములు, స్తోత్రములు, మతము, వేదాంతము, కులపురాణములు, వంశచరిత్రలు.
(2) పద్యములు - పద్యకావ్యములు (ప్రాచీనములు, ఆధునిక ములు), నీతిపద్యములు, శతకములు, దండకములు, అవధానములు, చాటువులు.
(3) నాటకములు, ప్రహసనములు;
(4) నవలలు.
(5) గద్యము : వచన కావ్యములు, కథలు, వినోదములు; పౌరాణిక కథలు ;
(8) చరిత్రము : దేశ చరిత్రములు, జీవిత చరిత్రములు,
(7) ఉపన్యాసములు (నై తిక సాంఘిక ములు) ;
(8) శాస్త్రములు : ఆర్థిక, పారిశ్రామిక, కృషి, గాన, భరతశాస్త్రములు, జ్యోతిశ్శాస్త్రము, న్యాయశాస్త్రము, పాకశాస్త్రము, ప్రకృతి శాస్త్రము, జీవశాస్త్రము, భూగోళశాస్త్రము, రాజ్యాంగశాస్త్రము, సివిక్సు, వాస్తుశాస్త్రము, వైద్యశాస్త్రము, శరీర - ఆరోగ్య శాస్త్రము, వివిధ శాస్త్రములు.
(9) భాషా గ్రంథములు: నిఘంటువులు, లోకోక్తులు, వ్యాకరణము, అలంకారము, లక్షణ గ్రంథములు, విమర్శనములు, కవుల చరిత్రలు.
10. పదములు, కీర్తనలు, హరికథలు, యక్షగానములు, పదములు, పాటలు.
11. వాచకములు.
12. వార్షికచర్యలు, నిబంధనలు, పట్టికలు.
13. పత్రికలు.
14. సంస్కృతగ్రంథములు, కావ్యములు, నాటకములు, లక్షణగ్రంథములు.
15. హిందీ గ్రంథములు.
494