Jump to content

పుట:SamskrutaNayamulu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
128

సంస్కృతన్యాయములు

పరమేశ్వరబుద్ధితో భూతతృప్రిగావించిన సర్వభూతాంత రాత్మయవు ప్రమాత్మ ప్రసన్ను డవును. తద్ద్వారా పునరావృత్తితహితమైన అపవర్గప్రాబ్తి కలుగును.

కడుపునిండ భుజించిన నవవయము లన్నియు పరిపుష్టి నొంది శరీరము పెరుగునట్లు

వేదకాశన్యాయము

త్రివేణేసంగమమున శిక్ల, కృష్ణ లోహిత వర్ణములుగల గంగా, యమునా, సరస్వతీ నదులు కలిసి ఆజలమున చక్కని ఒకక్రొత్తరంగు ఏర్పడును.

త్రివర్ణల్ములును, త్రిగుణములును గల త్రిమూర్తి లొకేస్వరూపముగనై సచ్చిదానందమయుండును, జ్యోతిస్స్వరూపుడును, స్వయంప్రకాశుడు నగు విరాట్పుతుషుడు వెలుగొందును.

వేతనన్యాయము

ప్రబ్బలిచెట్టు యేటియొడ్దున నీటి నానుకొనియుండి, కెరటము వచ్చినపుడు వంగుచు; కెరటము వచ్చినవెంటనే లేచుచు నుండును.

మతిమంతుడు దుష్టుల నెదురక వినమ్రుడట్లు తలయొగ్గి వారిబారిమబడక సుఖముండును.

వేశ్యాకాంతన్యాయము

వెలయాలికి మగ డొక డను నేర్పాటు లేనట్లు.