పుట:Parama yaugi vilaasamu (1928).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము.

47


యాపూర్ణమతులకు నావేళ విశ్వ
రూపి యప్పుడ విశ్వరూపంబుఁ జూప
నాసర్వమయురూప మవలోకనంబు
చేసి మ్రొక్కుచు మునిశేఖరు ల్మఱియు
నా నంద సుతురూప మపుడు సేవించి
యానందపరవశు లగుచు నుప్పొంగి
యంతాదు లనుపేర నలరుప్రబంధ
చింతామణులు ముక్తిఁ జేర్చునిచ్చెనలు
వేదరూపములు గావించిరి మూడు
వేదాంతవేద్యుఁ డావిశ్వమయుండు
నంటున నయ్యోగినాథుల మతులఁ
దొంటిచందమున నస్తోకుఁ డై యుండె
యోగినాథులు దివ్యయోగసామ్రాజ్య
భోగు లై భువిఁ జరింపుచునుండి రనుచు.
నలమేలుమంగకు నమలాంతరంగ
కలినీలవేణికి నబ్జపాణికిని
అతిలోకమతికి శేషాచలరాజ
పతికి సరోముఖ్యభక్తసంతతికి
నంకితంబుగను శ్రీహరిభక్తనికర
పంకజార్యమ తాళ్ళపాకన్నయార్య.