పుట:Parama yaugi vilaasamu (1928).pdf/616

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అష్టమాశ్వాసము.

599


వరదరాజున కనవరత మంబువులు
కరమర్థితోడ లక్ష్మణదేశికుండు
కొనివచ్చుత్రోవ నెక్కొని యామునేయ
ముని వచించినస్తోత్రములు వచించుటయు
నది విని రామానుజార్యుఁ డెంతయును
ముద మొంది యమ్మహాత్మునకు వందనము
సవరించి యమ్మహాస్తవమణి యిట్లు
సవరించినట్టి యాచార్యుఁ డెవ్వాఁడు
అన విని యపుడు మహాపూర్ణుఁ డతని
కనియె నీనుతి యామునార్యశేఖరుఁడ
యొనరించె నమ్మహాయోగిపుంగవుఁడు
మునుకొని శ్రీరంగమున నున్నవాఁడు
అనిన రామానుజుఁ డనియె నన్నిప్పు
డనఘాత్మ యాయామునాచార్యవర్యు
పాదంబు లాశ్రయింపంగఁజేసెదవె
నీదయ నామీఁద నిగుడించి యిప్పు
డనుటయు మెచ్చి మహాపూర్ణుఁ డట్ల
యొనరింతు రమ్మని యొడఁగూడఁ బలికి
యారామ సోదరు నపుడు దోకొనుచు
శ్రీరంగమునకు వేంచేసి కావేరి