పుట:Parama yaugi vilaasamu (1928).pdf/594

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[37]

అష్టమాశ్వాసము.

577


పైపన్నుఁ దెమ్మని భటులచే బిరుద
దీపితం బైనపత్రికఁ బంఫుటయును
నది చూచుకొనుచు మహాభాష్యగురుఁడు
కిదుకుచు నెంతయు ఖిన్నుఁడైయుండె
నాయెడం జనుదెంచి యామునసూరి
యాయనచే పత్ర మలవోకఁ జూచి
పెలుచ గోపించి యాబిరుదపత్రంబు
బలిమిఁ గైకొని చించి పాఱంగవైచి
తనదైనబిరుదుపత్రమున లిఖించి
పనివడి వారిచేఁ బంపెఁ బంపుటయు
నది చూచి కోపించి యాపురోహితుఁడు
ముదమేది చోళునిముందరం బెట్టి
యామాట లెఱిఁగింప నరుదంది రాజు
యామునేయుని వేగ నటకు రప్పించి
యమరంగ సప్తపూర్వాద్రులనడుమ
హిమసేతువులలోన నిద్దరలోన
వదలనికడకతో వాదించి నన్ను
నెదిరెడువిద్వాంసుఁ డెవ్వఁడు లేఁడు
అనునర్థ మొదవఁ బత్రాలంబనంబు
జననాథు వాకిట సవరించి యపుడు