పుట:Parama yaugi vilaasamu (1928).pdf/588

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అష్టమాశ్వాసము.

571


యంతరసాంతరహారి యైనట్టి
కంతుతండ్రిని గోపికామనోహరుని
యన్నాథముని మది ధ్యానంబు సేయు
చున్న యత్తఱిఁ జోళుఁ డొకనాఁడు కూర్మి
తనపట్టమహిషులుఁ దాను నేతెంచి
నసవిల్తుఁగురువీరనారాయణేశు
సేవించి పోవ నాక్షితిపాలవరుని
భావించి గోపికాభామలతోడ
నరుదెంచినట్టి శ్రీహరి యంచుఁ దలఁపఁ
బరువడి నాభూమిపాలునివెంటఁ
బురముఁ జొచ్చినదాఁకఁ బోవ డెందముల
నరుదంద నిజశిష్యు లామౌనిఁ జేరి
దేవ! మీ రిటకు నేతెంచినకార్య
మేవెర వది యానతిమ్ము నావుండు
నావల్లకీకమలాననాసహితుఁ
డైవచ్చు శ్రీకృష్ణుఁ డని విచారించి
వచ్చితి నన శిష్యవరులు మోదించి
రచ్చోట వీడ్కొని యానాథమౌని
మరలి వేగమె నిజమందిరంబునకు
నరుదెంచి సకలశిష్యావృతుం డగుచు